క్లినిక్లో ఉదయం వైద్యం, రాత్రి వ్యభిచారం: పక్కా స్కెచ్తో ముఠా గుట్టు రట్టు
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజధాని భోపాల్లో నర్సింగ్ హోమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పూట ఈ నర్సింగ్ హోమ్లో వైద్యులకు చికిత్స నిర్వహించేవారు. రాత్రిపూట వ్యభిచార కార్యక్రమాలు సాగేవి.
భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజధాని భోపాల్లో నర్సింగ్ హోమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పూట ఈ నర్సింగ్ హోమ్లో వైద్యులకు చికిత్స నిర్వహించేవారు. రాత్రిపూట వ్యభిచార కార్యక్రమాలు సాగేవి.
also read:మండపేటలో స్నేహితుడిని చితకబాది డిగ్రీ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పట్టణంలో బర్జేడీ ప్రాంతానికి చెందిన మహిళా డాక్టర్ యునానీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అయితే ఈ క్లినిక్లో రాత్రిపూట వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది.
Also read:19 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల వివాహిత జంప్: పోలీసులకు ఫిర్యాదు
ఆ నర్సింగ్ హోమ్లో వ్యభిచారం జరుగుతోందా లేదో తెలుసుకొనేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ దుస్తుల్లో ఉద్యోగం కోసం నర్సింగ్ హోమ్ కు వెళ్లింది. అయితే ఉద్యోగం లేదు. కానీ, వ్యభిచారం చేస్తే పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామని డాక్టర్ మహిళా కానిస్టేబుల్ కు ఆఫర్ ఇచ్చింది.
ఆసుపత్రిలోనే అప్పటికే కొందరు వ్యభిచారిణులతో విటులు గడుపుతున్న విషయం ఆమె గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఈ క్లినిక్ పై దాడి చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఆరుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఆసుపత్రిని టీఎంసీకి చెందిన నేత నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు డాక్టర్ ను అరెస్ట్ చేసిన వెంటనే పలువురు ఆమె ఫోన్ కు ఫోన్లు చేశారు. వ్యభిచారం కోసం అమ్మాయిలు ఉన్నారో లేదాో తెలుసుకొనేందుకు ఈ ఫోన్లు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.