తనకు పుట్టలేదని కూతురిపై రేప్.. తండ్రికి మరణశిక్ష
కన్న కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కన్న కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ స్పెషల్ కోర్టు సోమవారం ఈమేరకు తీర్పు వెలువరించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ కి చెందిన వ్యక్తి(42)కి వివాహమై.. 6ఏళ్ల కూతురు ఉంది. అయితే.. తన భార్య క్యారెక్టర్ మంచిది కాదని.. ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ.. తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే కన్న కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017, మార్చి 15వ తేదీన అర్థరాత్రి ఉరివేసి పాపను హత్య చేశాడు.
కాగా.. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిని అరెస్టు చేశారు. పాప శవానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు తేలింది. అంతేకాకుండా డీఎన్ఏ టెస్టులో ఆ పాప అతని కుమార్తె అని కూడా తేలింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణ జరగగా.. సోమవారం న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అతనికి ఉరిశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.