ఉత్తర ప్రదేశ్లో నిర్భయ ఘటన : కదిలే బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్.. !!
సుల్తాన్పూర్ : ఉత్తర ప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో సుల్తాన్పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
సుల్తాన్పూర్ : ఉత్తర ప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో సుల్తాన్పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
మంగళవారం రాత్రి, ఒక లగ్జరీ బస్సును చెకింగ్ కోసం ఆపారు. బస్సులో చెకింగ్ చేస్తున్న సయమంలో, బస్సు లాస్ట్ సీటు కింద ముగ్గురు పిల్లలు కనిపించారు. వారిలో ఇద్దరు అమ్మాయిలున్నారు. ఈ మేరకు బల్దిరాయ్ సర్కిల్ ఆఫీసర్ రాజారాం చౌదరి తెలిపారు.
వారు తీవ్రభయంతో ఉండడంతో పోలీసులు వారిని బుజ్జగించి, వివరాలు సేకరించగా.. వారిలో 15యేళ్ల బాలిక మీద ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని విచారణ సమయంలో తెలిసింది.
ఈ దారుణానికి కారణమైన బాలిక సవతి సోదరి, బస్సు డ్రైవర్, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేశారు.
దారుణమైన ఈ ఘటనలో బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల తర్వాత తన కుటుంబానికి అప్పగించినట్లు చౌదరి తెలిపారు.