Asianet News TeluguAsianet News Telugu

మీరట్ లో ఎంబీఏ విద్యార్థినిపై నలుగురు గ్యాంగ్ రేప్

ఓ ఎంబిఎ విద్యార్థినిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో చోటు చేసుకుంది. పోలీసులు బాధితురాలిని కాపాడారు.

MBA girl abducted, gangraped in Meerut
Author
Meerut, First Published Feb 15, 2020, 10:48 AM IST

మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసి, నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు శుక్రవారం ఆ విషయం చెప్పారు.

సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ ను గుర్తించగలిగారు. 

ఆ తర్వాత ఆమెను బులంద్ షహర్ లోని సియానా నుంచి కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గర్హ్ ముక్తేశ్వర డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ తేజ్ వీర్ సింగ్ ఆ విషయం చెప్పారు. 

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. వైద్య కళాశాల ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios