Asianet News TeluguAsianet News Telugu

తండ్రి కళ్లెదుటే కూతురిపై గ్యాంగ్ రేప్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన వుండేది. తాజాగా బీహార్ లో జరిగిన అఘాయిత్యం ద్వారా ఇంట్లో వుండే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని తేటతెల్లమయింది. కన్న తండ్రి కళ్లముందే ఓ యువతిపై ఆరుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘోరం బీహార్ లో చోటుచేసుకుంది. 
 

Man tied to tree; daughter gang raped in Bihar
Author
Bihar, First Published Feb 7, 2019, 8:33 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన వుండేది. తాజాగా బీహార్ లో జరిగిన అఘాయిత్యం ద్వారా ఇంట్లో వుండే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని తేటతెల్లమయింది. కన్న తండ్రి కళ్లముందే ఓ యువతిపై ఆరుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘోరం బీహార్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్ లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన ఓ 19ఏళ్ళ యువతి తండ్రితో కలిసి ఇంట్లో వుంది. అయితే తాగునీటి వంకతో వారి ఇంటికి వచ్చిన ఆరుగురు యువకులు ఇంట్లో తండ్రీ కూతుళ్లు ఇద్దరే వున్నారని గుర్తించారు. దీన్ని అదునుగా భావించి ఇంట్లోకి చొరబడి యువతితో పాటు ఆమె తండ్రిని సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. 

అనంతరం తండ్రిని తాళ్లతో ఓ చెట్టుకు కట్టేసి యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాక్షసంగా వ్యవహరిస్తూ యువతి ఒంటిపై  తీవ్ర గాయాలు చేశారు. ఈ దుశ్చర్యతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. 

కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి తండ్రితో కలిసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అఘాయిత్యానికి పాల్పడిని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిని నిందితులను త్వరలో పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని జిల్లా ఎస్పీ ఆశిశ్‌ తెలిపారు.   

Follow Us:
Download App:
  • android
  • ios