Asianet News TeluguAsianet News Telugu

భార్యపై అత్యాచారం.. భర్తకు నగ్న చిత్రాలు పంపి బెదిరింపులు.. అవమానంతో ఆత్మహత్య...

ఓ వివాహిత మీద అంగతకుడు అత్యచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమె నగ్నచిత్రాలు తీసి భర్తకు పంపించాడు. అది చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 

man committed suicide over wife sexually assulted in rajastan
Author
First Published Dec 26, 2022, 11:00 AM IST

రాజస్థాన్ : కన్నూమిన్నూ కానకుండా కామంధులు చేసే పనికి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. బాలికలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఆడవారు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. వారిమీద అఘాయిత్యాలకు పాల్పడి నిండు జీవితాలను కాలరాస్తున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్ లో వెలుగు చూసింది. భార్యమీద ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. ఆమె నగ్న చిత్రాలను భర్త సెల్ ఫోన్ కు పంపాడు. అది చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్ బార్మర్ లోని బలోత్రా పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. డిసెంబర్ 16న స్థానికంగా ఉండే ఓ వివాహిత అనారోగ్యం కారణంగా డాక్టర్ కు చూపించుకోవడానికి బలోత్రా ఆస్పత్రికి వెళ్లింది. ఆమె వెళ్లడాన్ని గమనించిన గఫార్ ఖాన్ అనే వ్యక్తి.. ఆమెను వెంబడించాడు. ఆమెతో పాటు ఆస్పత్రి దాకా వచ్చాడు. ఎవ్వరూ లేని చోట ఆమెను కత్తితో బెదిరించాడు. పక్కనే ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్న చిత్రాలను తీశాడు. 

నేడు వీర్ బాల్ దివస్.. చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని.. వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్రంగా భయపడిపోయింది.  భయంతో ఇంటికి చేరుకుంది. భార్య అదోలా ఉండడం చూసిన భర్త ఏమైందని ఆరా తీశాడు. ముందు భయపడ్డా.. ఆ తరువాత జరిగిన విషయం మొత్తం భర్తకు చెప్పి భోరుమంది. అది విన్న భర్త కూడా షాక్ అయ్యాడు. భయంతో బిగుసుకుపోయాడు. ఇంతలో అతడి ఫోన్ కు ఏదో మెసేజ్ వచ్చింది. 

తీసి చూస్తే భార్య నగ్న ఫోటోలను నిందితులు పంపించాడు. విషయం ఎవరికైనా చెబితే.. ఈ ఫొటోలు ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భర్తను బెదిరిస్తూ మెసేజ్ చేశాడు. అది చూసిన భర్త వణికిపోయాడు. పరువు పోతుందని భయపడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. తొందరాపటు నిర్ణయం తీసుకున్నాడు.తీవ్రంగా ఆలోచించాడు. రోజంతా ఆలోచనలతోనే గడిపాడు. రాత్రి తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని మృతి మీద అనుమానంతో భార్యను ప్రశ్నించారు. ఆమె భోరున ఏడుస్తూ.. తన మీద జరిగిన అఘాయిత్యం చెప్పుకొచ్చింది. భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలిపింది. దీంతో జరిగిన విషయం కాస్తా బయటపడింది. నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హారుపరిచారు. ఆ తరువాత రిమాండ్ కు తరలించారు. ఒక అత్యాచారం, ఆత్మహత్యతో ముడిపడి ఉన్న ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios