శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.