Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో పోటీ చేయను.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్

కన్యా కుమారి పార్లమెంటు స్థానానికి తాను పోటీచేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు

kushboo Gave Clarity Over kanyakumari election
Author
Hyderabad, First Published Sep 15, 2020, 11:56 AM IST

తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ తెలిపారు. గత కొంతకాలంగా కన్యాకుమారి పార్లమెంట్ స్థానానికి ఆమె పోటీచేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా.. ఆ వార్తలపై ఆమె స్పందించారు.

కన్యా కుమారి పార్లమెంటు స్థానానికి తాను పోటీచేస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవాలని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన తనకు లేదని నటి ఖుష్బూ స్పష్టం చేశారు. కన్నియ కుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మరణంతో ఖాళీయైన ఆ స్థానానికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమవుతున్నాయి.

 ఈ క్రమంలో, కన్నియకుమారి స్థానం నుంచి కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి ఖుష్బూ పోటీ చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై ఖుష్బూను విలేకరులు ప్రశ్నించగా, ఎన్నికలు జరిగే ప్రతిసారి తన గురించి ఇలాంటి కథనాలు రావడం సహజంగా మారిందన్నారు. ఎంపీ వసంత్‌ కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios