తమిళనాడులో దారుణం: భర్తను కొట్టి వివాహితపై గ్యాంగ్రేప్, చిత్రహింసలు
తమిళనాడు రాష్ట్రంలోని పళనిలో కేరళలో నివాసం ఉంటున్న వివాహితపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 20న చోటు చేసుకొంది. కేరళలోని కన్నూర్ కు వెళ్లిన ఈ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చెన్నై: కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన వివాహితపై తమిళనాడులోని పళనిలో గ్యాంగ్రేప్ జరిగింది. బాధితులు కేరళలోని కన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఏడాది జూన్ 20వ తేదీన తమిళనాడులోని పళనిలో గుర్తు తెలియని వ్యక్తులు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తమిళనాడుకు చెందిన ఈ జంట ఉద్యోగ రీత్యా కేరళలోని కన్నూర్ జిల్లాలో నివాసం ఉంటున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ జంట ప్రముఖ పుణ్యక్షేత్రం పళనికి వెళ్లారు. ఈ సమయంలో ఆహారం తీసుకొచ్చేందుకు భర్త వెళ్లిన సమయంలో వివాహితను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి సమీపంలోని లాడ్జీలో అత్యాచారం చేశారు. లాడ్జీ మేనేజర్ సహా పలువురు అత్యాచారం చేశారని బాధితురాలి భర్త పోలీసులకు చెప్పారు.
తనపై లాడ్జీలో దాడి చేశారని బాధితురాలి భర్త చెప్పారు. వివాహిత ప్రైవేట్ బాగాల్లో బీరుబాటిళ్లతో దాడి చేశారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జూన్ 20వ తేదీన జరిగింది. అయితే కన్నూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆమె ప్రైవేట్ బాగాల్లో ఎలాంటి గాయాలు లేవని మెడికల్ రిపోర్టు తెలిపింది. ఈ ఘటన జరిగి సుమారు నెల రోజులు కావస్తున్నందున గాయాలు నయం కావొచ్చని తలసేరి డీఎస్పీ మూసా వల్లికాదన్ చెప్పారు.పరియారాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాధితురాలు చికిత్స తీసుకొంటుంది. త్వరలోనే ఆమెతో మాట్లాడి నిందితులను గుర్తిస్తామని పోలీసులు చెప్పారు. ఈ వివరాలను తమిళనాడు ప్రభుత్వానికి అందిస్తామని కూడ పోలీసులు తెలిపారు.