Asianet News TeluguAsianet News Telugu

దేశం తలదించుకునేలా చేసింది:తెలంగాణ వైద్యురాలి రేప్, హత్యపై రాజ్ నాథ్ సింగ్

దిశ ఘటన చాలా హేయకరమైనదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటన అందర్నీ కలచివేసిందని తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం స్పందించిందన్నారు. 

Justice for Disha case: Union minister Rajnath singh comments on DIsha incident
Author
New Delhi, First Published Dec 2, 2019, 1:39 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణలో అత్యంత దారుణ హత్యకు గురైన దిశ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెటర్నిరీ డాక్టర్ దిశపై జరిగిన దారుణమైన ఘటన అందర్నీ కలచివేసిందన్నారు. 

దిశ ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ తలదించుకునేలా చేసిందని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రతీ ఒక్కర్నీ కలచివేసిందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

 

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చట్టాల సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టాల్లో సవరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. దిశ ఘటనకు సంబంధించి నిందితులకు కఠిన శిక్షలు పడాలని తాము కోరుతున్నట్లు తెలిపారు రాజ్ నాథ్ సింగ్.  

మరోవైపు దిశ ఘటన చాలా హేయకరమైనదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఘటన అందర్నీ కలచివేసిందని తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం స్పందించిందన్నారు. 

చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం ఈ ఘటనపై చర్చించనున్నట్లు తెలిపారు. రాబోయే  రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అవసరమైతే చట్టాల సవరణకు సైతం కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు కిషన్ రెడ్డి. 

ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

ఆ నలుగురి నిందితులను ప్రజలకు అప్పగిస్తే తెలుస్తుంది: దిశ ఘటనపై జయాబచ్చన్

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

దిశ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అభ్యంతరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios