Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ కి బానిసగా మారి.. 40మంది పురుషులపై అత్యాచారం

నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 60ఏళ్లు దాటిన ముసలావిడ వరకు ఎవరినీ వదలిపెట్టని కామాంధులను మనం రోజూ టీవీల్లో, పేపర్లో వార్తల్లో చూస్తున్నాం. అయితే.. కేవలం స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఉదాహరణ.

Jaipur rape accused assaulted 35 children, 40 men: Police
Author
Hyderabad, First Published Jul 8, 2019, 2:28 PM IST

నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 60ఏళ్లు దాటిన ముసలావిడ వరకు ఎవరినీ వదలిపెట్టని కామాంధులను మనం రోజూ టీవీల్లో, పేపర్లో వార్తల్లో చూస్తున్నాం. అయితే.. కేవలం స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఓ వ్యక్తి అభం శుభం తెలియిని 35మంది చిన్నారులతోపాటు... 40 పురుషులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జైపూర్ లోని శాస్త్రీ నగర్ కి చెందిన ఏడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ సమయంలో... నిందితుడి అసలు చరిత్ర తెలుసుకొని పోలీసులు కూడా షాకయ్యారు.

గతంలో ఈ కామాంధుడు 35 మంది చిన్నారులు, 40 మంది పురుషులు, ట్రాన్స్‌జెండర్లపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలను అపహరించి అమ్ముకుంటూ వచ్చే డబ్బుతో జల్సాలు చేసే వాడని పోలీసులు చెప్పారు. మద్యం, సెక్స్‌కు బానిసైన ఈ వ్యక్తి పురుషులు, ట్రాన్స్‌జెండర్లు అనే తేడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.  గతంలో కూడా ఇతని పై పలు కేసులు నమోదయ్యాయన్నారు.  నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios