భారతదేశాన్ని సందర్శించడానికి ఇటలీ నుంచి ఓ పర్యాటకురాలిపై ముంబైకి చెందిన టూర్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
భారతదేశంలో మహిళలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉన్మాదులు స్వదేశంలోని మహిళలేనే కాకుండా విదేశాల నుంచి మన దేశాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులను సైతం కనికరం లేకుండా తమ కామ దాహానికి బలి చేస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించడానికి ఇటలీ నుంచి ఓ పర్యాటకురాలిపై ముంబైకి చెందిన టూర్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జూన్ 14వ తేదీన జరిగింది. కాగా.. భారత్లోని ఇటలీ రాయబార కార్యాలయం జోక్యంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇటలీ నుంచి వచ్చిన 37 ఏళ్ల బ్యాంకర్ను అమితాబచ్చన్ బంగ్లా చూపిస్తానంటూ ఓ టూరిస్ట్ గైడ్ నమ్మబలికి, బస్సులో టూర్కి తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటల తర్వాత బస్ టూర్ ముగియగానే కొలాబాలోని హోటల్లో డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకొని వెళ్లాడు. గైడ్ మాటలు నమ్మిన టూరిస్ట్, కారులో హోటల్కి బయలుదేరింది. మార్గమధ్యంలో టూరిస్ట్ ఓ లిక్కర్ షాపు వద్ద కారు ఆపి, మద్యం సేవించాడు. గైడ్ మద్యం సేవించడమే కాకుండా, తనని కూడా సేవించాలని బలవంతం చేసినట్లు టూరిస్ట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
గైడ్ మద్యం మత్తులో టూరిస్ట్ను కారులోనే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు టూరిస్ట్ ముంబైలోని ఇటలీ ఎంబసీని చేరుకొని జరిగినదంతా వివరించగా, వారు ముంబైలోని కోలాబా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది, టూరిస్ట్పై అత్యాచారం చేసిన గైడ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 2, 2018, 11:07 AM IST