Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి వచ్చిన ప్రేయసిపై ప్రియుడి రేప్: దారిలో మరో ముగ్గురు గ్యాంగ్ రేప్

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రియుడు అత్యాచారం చేసి పారిపోయాడు. ఆ తర్వాత ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

Girl molested by lover and on the way 3 men assault in Cchattisgarh
Author
Raypur, First Published Aug 21, 2021, 8:31 AM IST

రాయ్ పూర్: ఛత్తీస్ గడ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆ కీచక సంఘటన జరిగింది. నమ్మిన ప్రియుడే ఆమెపై అత్యాచారం చేయగా, ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ప్రియుడిని కలిసేందుకు యువతి అర్థరాత్రి అతని ఇంటికి వెళ్లింది. 

ఆగస్టు 15వ తేదీ అర్థరాత్రి ప్రియుడు యువతిని ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిచాడు. నమ్మి వచ్చిన ప్రేయసిపై అతను అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అటుగా ఓ బైక్ రావడంతో ఆమెను వదిలేసి పారిపోయాడు. దాంతో ఆమె అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. అయితే, దారిలో ఆమెకు మరో చేదు అనుభవం ఎదురైంది. బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చారు. 

ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చివరకు ఆమె తెల్లవారు జామున 4 గంటలకు ఇంటికి చేరుకుంది. దుస్తులు చిరిగిపోయి, దీనమైన స్థితిలో ఇంటికి చేరుకున్న యువతిని తల్లి ఏం జరిగిందని అడిగింది. 

తన ప్రియుడు చేసిన పని గురించి ఆమె తల్లికి చెప్పింది. వెంటనే కూతురిని తీసుకుని వెళ్లి తల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి జువెనైల్ హోంకు తరలించారు. 

రెండు రోజుల తర్వాత దారిలో జరిగిన అఘాయిత్యం గురించి యువతి తల్లికి చెప్పింది. తమకు సమాచారం అందడంతో పోలీసులు ఆ ముగ్గురిని కూడా అరెస్టు చేసారు. కామేశ్వర్ వర్మ, కౌశల్ పటేల్, రాజేశ్ వర్మలుగా నిందితులను గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో నిందితుడు మైనర్, రెండో కేసులోని ముగ్గురు నిందితులు కూడా పాతికేళ్ల వయస్సు దాటినవారు. దీంతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios