పెళ్లికి ముందే కాబోయే భర్తతో శృంగారం.. రక్తస్రావంతో యువతి మృతి..
ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం అనే ఉద్దేశంతో ఇద్దరూ కలుద్దాం అనుకున్నారు. తనకు కాబోయే భర్త ఉంటున్న ఇంటికి గత ఆదివారం యువతి చేరుకుంది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. అయితే శృంగారం తర్వాత ఆమెకు జననేంద్రియం నుంచి రక్తస్రావం ప్రారంభమయింది. ఎంతకూ తగ్గలేదు.
వారిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. మరో నెల రోజుల్లో పెళ్లి ఫిక్స్ అయింది. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం అనే ఉద్దేశంతో కాబోయే భర్తకు ఆమె శారీరకంగా దగ్గరయింది. అదే ఆమెకు శాపంగా మారింది. శృంగారం తర్వాత ఆమెకు విపరీతంగా రక్తస్రావం జరిగింది. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆమె బతకలేదు. రక్తం చాలా ఎక్కువగా పోవడంతో మరణించింది.
సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కోలార్ లోని ఓ హోటల్ లో పనిచేస్తున్న ఓ యువకుడు and దీప్ కు చెందిన 28 ఏళ్ల యువతితో ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ నెల చివర్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.
ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం అనే ఉద్దేశంతో ఇద్దరూ కలుద్దాం అనుకున్నారు. తనకు కాబోయే భర్త ఉంటున్న ఇంటికి గత ఆదివారం యువతి చేరుకుంది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. అయితే శృంగారం తర్వాత ఆమెకు జననేంద్రియం నుంచి రక్తస్రావం ప్రారంభమయింది. ఎంతకూ తగ్గలేదు.
దీంతో సదరు యువకుడు ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెకు రక్తస్రావం తగ్గలేదు. దీంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు కూడా రక్తస్రావం తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
అయినా రక్తస్రావం ఆగలేదు. దీంతో ఆ యువతి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కు చేరుకున్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.