Asianet News TeluguAsianet News Telugu

యువతిపై ఆస్పత్రి ఐసీయూలో గ్యాంగ్ రేప్: వార్డ్ బాయ్ ల పనే...

చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ ఆస్పత్రిలోని ఐసియులో ఓ అమ్మాయిపై సామూటహిక అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. వార్దు బాయ్ లు తనపై అత్యాచారం చేశారని అమ్మాయి ఆరోపించింది.

Girl claims molestation inside ICU at Bilaspur hospital
Author
Bilaspur, First Published May 25, 2020, 7:51 AM IST

బిలాస్ పూర్: తనపై ఆస్పత్రి ఐసియూలో సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఆరోపించింది. చత్తీస్ గఢ్ లోనన బిలాస్ పూర్ ప్రైవేట్ నర్సింగ్ హోంలోని ఐసియూలో చికిత్స పొందుతున్న గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న టీనేజ్ అమ్మాయి ఆ మేరకు ఫిర్యాదు చేసింది. చేతిరాతితో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలి తండ్రి బిలాస్ పూర్ సివిల్ లైన్ పోలీసు స్టేషన్ ను సంప్రదించాడు. ఆ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసారు. 

మే 18వ తేదీన 18 ఏళ్ల విద్యార్థిని బిలాస్ పూర్ లోని ఆస్పత్రిలో చేరింది. ఓ మందు వాడడం వల్ల ఆమెకు ఎలర్జీ ప్రారంభమైంది. ఆరోగ్యం కూడా దెబ్బ తిన్నది.

సంఘటనపై అమ్మాయి తమకు శనివారం సాయంత్రం తెలిపిందని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆక్సిజన్ మాస్క్ , బలహీనత కారణంగా మాట్లాడలేకపోయిందని, తనకు పెన్ను, కాగితం కావాలని సంకేతాల ద్వారా అడిగిందని వారు చెప్పారు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని కాగితంపై రాసి చూపించిందని చెప్పారు. 

ఈ సంఘటనను పోలీసులు తొలుత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు. మీడియాలో దీనికి సంబంధించిన వార్తాకథనాలు రావడం ప్రారంభించడంతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios