Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో దోపిడీదొంగల కిరాతకం.... కదులుతున్న రైల్లో యువతిపై గ్యాంగ్ రేప్

కదులుతున్న రైల్లో ఓ యువతిపై దోపిడీదొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 

gang rape on young girl in pushpak express at maharashtra
Author
Mumbai, First Published Oct 10, 2021, 8:02 AM IST

లక్నో: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చిన్నారులు మొదలు బాలికలు, యువుతులు, వివాహిత మహిళలు చివరకు వృద్దుల మానప్రాణాలకు సైతం రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా,  పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతినిత్యం దేశంలోనే ఏదో ఒకచోట మహిళలపై దారుణాలు జరుగుతూనే వున్నారు. తాజాగా మారణాయుదాలతో బెదిరించి కదులుతున్న రైల్లోన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుండి మహారాష్ట్ర రాజధాని ముంబై వెళుతున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో దొపిడీకి పాల్పడ్డారు దొంగలు. మహారాష్ట్ర సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇగత్ పురి-కాసర పోలీస్ స్టేషన్ల మధ్య రైల్లోకి ప్రవేశించిన 8మంది దోపిడిదొంగలు మారణాయుదాలతో ప్రయాణికులు బెదిరించారు. దాదాపు 20మంది ప్రయాణికుల వద్ద నగదు, విలువైన వస్తువులు, బంగారం, సెల్ ఫోన్లు దోచుకున్నారు. 

read more  బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్

అంతటితో ఆగకుండా స్లీపర్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై ఈ దుండగుల కన్ను పడింది. ఆమెను మారణాయుదాలతో బెదిరించిన కదులుతున్న రైల్లోనే అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాతి రైల్వే స్టేషన్ వచ్చేలోపే రైల్లోంచి దిగి పరారయ్యారు ఈ దోపిడి దొంగలు.

రైలు కాసర రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పటికే దోపిడీకి పాల్పడటమే కాకుండా యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుల గ్యాంగ్ లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios