Asianet News TeluguAsianet News Telugu

బహిర్భుమికి వెళ్లిన మైనర్ అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు అరెస్ట్..

ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు మైనర్లైన అక్కాచెల్లెళ్ల మీద సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Gang rape of minor sisters in Uttar Pradesh, Five arrested
Author
Hyderabad, First Published Jul 4, 2022, 6:46 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. ఇద్దరు  మైనర్ బాలికలపై ఉత్తరప్రదేశ్ లోని మావూ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఇద్దరు వయసు 17,15 సంవత్సరాలు. ఈ ఇద్దరు బాలికల మీద ఐదుగురు యువకులు అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.  ఈ మేరకు బాలికల తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. దీని ప్రకారం నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటన ద్వసరై గ్రామంలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు బాలిక తండ్రి జూన్ 30న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన కుమార్తెలు ఇద్దరు బహిర్భూమికని వెళ్లిన సమయంలో  నిందితులు కాపు కాచి ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల మీద పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద  కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని అన్నారు. 

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో దారుణం.. బ‌ల‌వంతంగా మ‌తం మార్చి, పెళ్లి చేసుకొని యువ‌తిపై గ్యాంగ్ రేప్..

ఇదిలా ఉండగా, జూన్ 27న ఉత్తరాఖండ్ లో ఇలాంటి దారుణమే జరిగింది. హరిద్వార్‌లోని రూర్కీలో ఒక మహిళ ఆమె ఆరేళ్ల కుమార్తెపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్ జరిగింది. వారిద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెడుతుంటే ఓ వ్యక్తి కారులో లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తరువాత అతను, అతని స్నేహితులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన ఆరేళ్ల కూతురితో కలిసి రాత్రి సమయంలో ముస్లిం మత ప్రాంతమైన పిరాన్ కలియార్ నుండి ఇంటికి వెళుతుంది. అమెకు పరిచయం ఉన్న సోను అనే వ్యక్తి ఆమెను పిలిచి.. లిఫ్ట్ ఇచ్చాడని వారు చెప్పారు. 

ఆమె కారులోకి ఎక్కే సమయానికే ఆ వ్యక్తి స్నేహితులు కొందరు అప్పటికే కారులో ఉన్నారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోవల్ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం, సోను, అతని సహచరులు ఆమెను కారులోకి ఎక్కించుకున్న తరువాత కదులుతున్న కారులోనే మహిళ, ఆమె కుమార్తెపై అత్యాచారం చేశారు. అనంతరం కాలువ దగ్గర పడేశారు. దీంతో షాక్ లోకి వెళ్లిన మహిళ.. తేరుకుని అర్థరాత్రి ఎలాగో దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కారులో ఎంత మంది పురుషులు ఉన్నారో మహిళ సరిగ్గా చెప్పలేనప్పటికీ, దానిని నడుపుతున్న వ్యక్తి పేరు సోను అని ఆమె చెప్పింది. బాధితులిద్దరినీ రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించామని, వారి వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని, అయితే ఇంకా వారి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios