షాక్: రూ. 50 కోట్లివ్వాలని సీఎంకు ఖైదీ లేఖ
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు రూ, 50 కోట్లు చెల్లించాలంటూ ఛత్తీస్ఘడ్ ఖైదీ బెదిరింపు లేఖ రాశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు రూ, 50 కోట్లు చెల్లించాలంటూ ఛత్తీస్ఘడ్ ఖైదీ బెదిరింపు లేఖ రాశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఛత్తీస్ఘడ్లోని జాంజ్గిరి-చంపా జిల్లాకు చెందిన పుష్పేంద్రనాథ్ చౌహాన్ అనే వ్యక్తి దోపీడీ, హత్య కేసులో అరెస్టయ్యాడు. 2009 నుండి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
అయితే జైలు నుండే తనకు రూ. 50 కోట్లు ఇవ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశాడు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ లేఖపై విచారణ చేపడుతున్నట్టు బిలాస్పూర్ ఎస్పీ ఆరిఫ్ తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీన ఈ లేఖ పోలీసులకు అందింది.
ఈ లేఖను జైలు నుండి చౌహాన్ అనే ఖైదీ రాసినట్టు గుర్తించారు. ఈ విషయమై విచారణ జరిపారు. చౌహాన్ తాను వార్తల్లో వ్యక్తిగా నిలిచేందుకు గాను ఈ పనిచేశాడని భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి కూడ సరిగా లేదని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
. బిలాస్పూర్ అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ ఆదివారం నిందితుడిని విచారించారు. గతంలోనూ ఓ కలెక్టర్కు ఈ తరహా లేఖను చౌహాన్ పంపినట్లు పోలీసులు గుర్తించారు.