Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు సజీవ దహనం

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు

Four charred to death in bus accident
Author
Tamil Nadu, First Published Oct 19, 2018, 11:55 AM IST


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు.  మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తిరుచ్చిలో ఆగి ఉన్న లారీనీ  మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో  మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో నలుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.  మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుండి ప్రయాణీకులను తీసుకెళ్తున్న బస్సు తిరుచ్చి సమీపంలోకి రాగానే  ఆగి ఉన్న కాంక్రీట్ మిక్సర్  లారీని వెనుక నుండి ఢీకొట్టింది.

బస్సులో ముందు భాగంలో ఉన్న నలుగురు ప్రయాణీకుల మంటల ధాటికి సజీవ దహనమయ్యారు.  మరికొందరు  గాయపడ్డారు. బస్సులో మంటలు వ్యాపించడంతో  కొందరు ప్రయాణీకులు  అత్యవసర ద్వారం నుండి బయటపడ్డారు.

ఈ విషయం తెలిసిన వెంటనే  ఫైరింజన్లు  హుటాహుటిన  సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో తిరుచ్చి- చెన్నై హైవేపై  ట్రాఫిక్‌కు సుమారు రెండు గంటలకు పైగా అంతరాయమేర్పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios