ఒడిశాలో అమానూషం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
ఒడిశాలోని పూరిలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిని పక్కింట్లో ఉండే వ్యక్తి ఇంటిపై డాబా మీదకు తీసుకెళ్లి రేప్ చేశాడు. అత్యాచారానికి గురైన ఆ చిన్నారి తీవ్ర అస్వస్థకు గురైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్లోని మల్లీ స్పెషల్టీ ఆస్పత్రికి తరలించారు.
దేశంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం .. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మానవ మృగాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కనికరం లేకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. దాంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ఆదివారం ఒడిశాలోని పూరీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని పూరీలో డ్రైవర్గా పనిచేసే మహేశ్ బాధిత బాలిక ఇంటికి తరుచూ వెళ్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిని పక్కింట్లో ఉండే మహేశ్ మహంతి అనే వ్యక్తి ఇంటిపై డాబా మీదకు తీసుకెళ్లి రేప్ చేశాడు. ఆ చిన్నారి కేకలు వేయడంతో తల్లి మేడ మీదకు వెళ్లింది. దాంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు.
అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర అస్వస్థకు గురైంది. తల్లిదండ్రులు ఆ చిన్నారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి ఆ చిన్నారిని కటక్లోని ఎస్సిబి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి చావు బతుకుల మధ్య ఉన్నట్టు సమాచారం. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు జగత్సింగ్పూర్ జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీస్ సూపరింటెండెంట్ కేవీ సింగ్ తెలిపారు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడైన మహేశ్ జగత్సింగ్పూర్ జిల్లాకు చెందినవాడని చెప్పారు. కాగా మధ్యప్రదేశ్లో ఆదివారం 20 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో మైనర్లు ఉన్నారు.
మరోవైపు .. ముంబాయిలో దారుణం జరిగింది. గోవండి ప్రాంతంలో శనివారం 20 యేండ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇందులో మైనర్లు కూడా ఉన్నారు. శివాజీ నగర్ ప్రాంతంలో ఇది జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.