తండ్రితో కలిసి మద్యం తాగి..చెల్లెలిపై రేప్
దీపావళి పర్వదినాన.. తండ్రితో కలిసి మద్యం తాగిన ఓ కొడుకు.. తండ్రి నిద్రించిన తర్వాత తన తోడబుట్టిన చెల్లిలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీపావళి పర్వదినాన.. తండ్రితో కలిసి మద్యం తాగిన ఓ కొడుకు.. తండ్రి నిద్రించిన తర్వాత తన తోడబుట్టిన చెల్లిలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకుంది. కాగా.. ఆ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... గుడ్ గావ్ లోని ఫరూక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. భార్యకి మతిస్థిమితం కోల్పోయి.. చికిత్స పొందుతోంది. కాగా.. బుధవారం రోజు సాయంత్రం దీపావళి పండగను పురస్కరించుకొని ఇంట్లో పూజ నిర్వహించారు. పూజ అనంతరం ఆ వ్యక్తి తన కుమారుడితో కలిసి మద్యం సేవించాడు.
ఆ సమయంలో అతని ఇద్దరు కుమార్తెలు ఒక గదిలో.. ఇంకో కుమార్తె మరో గదిలో నిద్రిస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత అతను వెళ్లి తన గదిలో పడుకున్నాడు. కాగా.. తండ్రి నిద్రించాడని నిర్ధారించుకున్న తర్వాత.. అతని కుమారుడు.. తన చెల్లెలి గదిలోకి వెళ్లి బలవంతంగా రేప్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బాధిత బాలిక ఈ విషయంపై తండ్రికి ఫిర్యాదు చేసింది.
దీంతో వెంటనే.. అతను తన కుమార్తెను వెంట పెట్టుకొని పోలీసు స్టేషన్ కి వెళ్లి తన కొడుకుపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.