Asianet News TeluguAsianet News Telugu

పామును మింగిన వ్యక్తి నాలుగు గంటల తర్వాత ఇలా....

తాగిన మైకంలో ఓ వ్యక్తి బతికున్న పాము పిల్లను మింగాడు. పాము పిల్లను మింగిన నాలుగు గంటల తర్వాత  అతను మరణించాడు.

Drunk man dies after eating live snake in UP; video goes viral
Author
Lucknow, First Published Sep 13, 2018, 2:46 PM IST

లక్నో:తాగిన మైకంలో ఓ వ్యక్తి బతికున్న పాము పిల్లను మింగాడు. పాము పిల్లను మింగిన నాలుగు గంటల తర్వాత  అతను మరణించాడు.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్‌రోహ్ జిల్లాలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్‌రోహ్ జిల్లాలో మహిపాల్ సింగ్ అనే వ్యక్తికి 40 ఏళ్లు.  మద్యం తాగి రోడ్డు వెంట నడుచుకొంటూ వెళ్తున్నాడు.  దీంతో అతనికి రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కన్పించింది.  దీంతో ఆ పాము పిల్లను తీసుకొని సరదాగా ఆడుకోవడం ప్రారంభించాడు.

దీంతో స్థానికులు మహిపాల్ సింగ్  వద్దకు చేరుకొని  అతడి విన్యాసాలు చూస్తూ ఎంజాయ్ చేశారు.  మహిపాల్ సింగ్  పాము పిల్లతో ఆడుకొంటుండగా కొందరు వీడియోలు తీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న మహిపాల్ మరింత రెచ్చిపోయాడు.

పాము పిల్లను తల మీద పెట్టుకొన్నాడు.  ఈ సమయంలోనే పామును  నోట్లో పెట్టుకొంటావా అంటూ  ఓ వ్యక్తి ప్రశ్నించాడు.  దీంతో వెంటనే ఆ పామును అతను నోట్లో పెట్టుకొన్నాడు. వెంటనే పాముల అతని కడుపులోకిపోయింది. ఎన్నిసార్లు అతను వాంతులు చేసుకొన్నా కూడ పాము మాత్రం బయటకు రాలేదు.పామును తిన్న నాలుగు గంటల తర్వాత మహిపాల్ సింగ్  శరీరానికి విషం ఎక్కింది.  దీంతో అతను మృత్యువాత పడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios