Asianet News TeluguAsianet News Telugu

పంటపొలాల్లోకి ఎత్తుకెళ్లి...నాలుక తెగ్గోసి మరీ యువతిపై గ్యాంగ్ రేప్

కామాంధుల చేతిలో నలిగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయిన యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

Dalit teen gang raped in up
Author
Lucknow, First Published Sep 29, 2020, 12:40 PM IST

లక్నో: తల్లితో కలిసి పొలానికి వెళ్లిన ఓ యువతిపై నలుగురు కామాంధులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అత్యాచారమే దారుణమనుకుంటే యువతి అరవకుండా నాలుక కోసి మరీ తమ కామవాంఛను తీర్చుకున్నాడు దుండగులు. ఇలా కామాంధుల చేతిలో నలిగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయిన యువతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యూపీలోని హత్రస్ కు చెందిన ఎస్సీ మహిళ తన 20 ఏళ్ల కూతురు, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన ఓ నలుగురు అగ్రకులానికి చెందిన యువకులు ఎలాగయినా యువతిని అనుభవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తల్లికి కాస్త దూరంగా వెళ్లిన యువతిని అమాంతం ఓ తోటలోకి ఎత్తుకెళ్లారు. 

అయితే యువతి గట్టిగా అరుస్తుండటంతో అత్యంత పాశవికంగా నాలుకను కోసేశారు. అనంతరం నలుగురూ ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 

read more   వివాహేతర సంబంధం: భార్యను చితకబాదిన పోలీస్ అధికారి

కూతురు కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన తల్లి చుట్టుపక్కల వెతకగా అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే ఆమెను వైద్యం కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా యువతి మృతిచెందింది. 

ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కఠిన శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబంతో పాటు స్థానిక ప్రజలు పోలీసులను కోరుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios