Asianet News TeluguAsianet News Telugu

సిబిఎస్ఈ ఎగ్జామ్స్ టాపర్ పై గ్యాంగ్ రేప్

హర్యానాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆ 19 ఏళ్ల యువతి సిబిఎస్ఈ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచింది. అందుకు రాష్ట్రపతి నుంచి ఆమె సత్కారం కూడా పొందింది.

College Student Who Topped CBSE Board Exam Alleges Gang-Raped In Haryana
Author
Gurgaon, First Published Sep 14, 2018, 7:55 AM IST

గుర్గావ్: హర్యానాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆ 19 ఏళ్ల యువతి సిబిఎస్ఈ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచింది. అందుకు రాష్ట్రపతి నుంచి ఆమె సత్కారం కూడా పొందింది. అయితే, ఆమెను కొంత మంది దుండగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆమె కోచింగ్ సెంటర్ కు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. పొలంలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. పొలం వద్ద అప్పటికే ఉన్న కొంత మంది కూడా ఆమెపై అత్యాచారం చేశారు. 

తమ ఫిర్యాదును తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారని, ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్ కు తాము పరుగులు పెట్టాల్సి వచ్చిందని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు. 

మహిళ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహేంద్రగఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత సంబంధిత పోలీసు స్టేషన్ కు కేసు బదిలీ చేస్తామని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios