Asianet News TeluguAsianet News Telugu

దారుణం: మైనర్ బాలికపై మూడు రోజుల పాటు రేప్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి  మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Child sold to man thrice her age, raped for three days in Madhya Pradesh
Author
New Delhi, First Published May 20, 2019, 10:53 AM IST

భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి  మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బుందేల్‌ఖండ్‌లోని చత్తాపూర్ జిల్లాకు చెందిన మద్యానికి అలవాటుపడిన  ఓ వ్యక్తి తన కూతురిని ఓ వ్యక్తికి విక్రయించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. తన తండ్రి ఈ ఏడాది మే 12వ తేదీన దేవి భాస్కర్ అనే వ్యక్తికి రూ. 50వేలకు విక్రయించారని చెప్పింది. అదే రోజున దేవి భాస్కర్ తనను  ఓ దేవాలయంలోకి తీసుకెళ్లి  చీర కట్టించి...   మెడలో మంగళసూత్రం కట్టారని బాధితురాలు తెలిపింది.

ఆ తర్వాత తనను భాస్కర్  తన ఇంటికి తీసుకెళ్లి వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు తెలిపింది. తాను చాలా గాయపడినట్టుగా బాధితురాలు తెలిపింది.భాస్కర్ కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. చిన్నారి ఏడుస్తోందని ఆరోపిస్తూ తండ్రికి ఆ బాలికను అప్పగించారు.

బాలిక తల్లికి తండ్రికి మధ్య విబేధాలు ఉన్నాయి.  ఈ కారణంగానే బాలిక తల్లి సాగర్  జిల్లాలో భర్తకు దూరంగా నివాసం ఉంటుంది.ఈ విషయం తెలుసుకొన్న తల్లి కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే తన భర్తతో పాటు ఆయన సోదరి కలిసి తన కూతురిని ఓ వ్యక్తికి విక్రయించినట్టుగా చిన్నారి తల్లి ఆరోపిస్తోంది. చిన్నారి కంటే మూడు రెట్ల వయస్సు ఎక్కువ వ్యక్తికి విక్రయించారని బాధితురాలు చెప్పారు.చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios