Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా ముగిసిన ఆపరేషన్ గరుడ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, సీబీఐ అదుపులో 6,600 మంది

దేశవ్యాప్తంగా సీబీఐ, ఎన్సీబీలు నిర్వహించిన ఆపరేషన్ గరుడ ముగిసింది.  సందర్భంగా 6,600 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్ విక్రయదారులపై 127 కేసులు నమోదు చేశారు అధికారులు.

CBIs Operation Garuda against drugs end
Author
First Published Sep 29, 2022, 4:13 PM IST

దేశవ్యాప్తంగా ఆపరేషన్ గరుడ దాడులు ముగిశాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీబీఐ, ఎన్సీబీ సోదాలు నిర్వహించింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, మణిపూర్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీబీఐ, ఎన్సీబీ సోదాలు జరిపింది. ఈ సందర్భంగా 6,600 మంది అనుమానితుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే డ్రగ్స్ విక్రయదారులపై 127 కేసులు నమోదు చేసింది. వీరిలో 175 మందిని అరెస్ట్ చేయగా.. ఆరుగురు పరారీలో వున్నారు. భారీగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను సీజ్ చేశారు. 5 కిలోల డ్రగ్స్‌తో పాటు 33 వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీటితో పాటు భారీగా మత్తు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, డ్రగ్స్ సీజ్ చేశారు. 

ఇకపోతే.. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా నార్కోటిక్స్ బ్యూరో నివేదిక వెల్లడించింది. దేశంలో గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. గత ఏదాది దేశంలో సుమారు  7 లక్షల కిలోల గంజాయి సీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండే 50 శాతం ఉందని ఎన్సీబీ నివేదిక తెలిపింది. గత ఏడాది రెండు లక్షల కిలోల గంజాయిని ఏపీలో సీజ్ చేశారు. అంతేకాదు 18 కిలోల హష్ ఆయిల్ ను కూడా సీజ్ చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై 1775 కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు గంజాయి సరఫరా చేస్తూ 4,202 మంది పట్టుబడ్డారు. 

ALso REad:ఏపీలో 2 లక్షల గంజాయి సీజ్:2021 ఎన్సీబీ నివేదిక

మరోవైపు హెరాయిన్ కేసుల్లో గుజరాత్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎన్‌సీబీ తెలిపింది. దేశంలో 7618 కిలోల హెరాయిన్ ను గత ఏడాది పట్టుకున్నారు. అయితే గుజరాత్ రాష్ట్రంలోనే అత్యధికంగా 3,334 కిలోలు గుజరాత్ లోనే పట్టుబడింది. గుజరాత్ తర్వాత హెరాయిన్ కేసుల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. యూపీలో 1337 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు అధికారులు. నార్కోటిక్స్ బ్యూరో 2021 నివేదికను ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. గత ఏడాది తెలంగాణలో 35,270 కిలోల గంజాయి ని సీజ్ చేశారు. పంజాబ్ లో అత్యధికంగా మత్తు పదార్ధాల ప్రభావం ఉన్నట్టుగా ఎన్సీబీ నివేదిక చెబుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios