Asianet News TeluguAsianet News Telugu

మూడో తరగతి విద్యార్థినికి న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించిన ప్రిన్సిపాల్‌.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బుదౌన్‌లోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ మూడో తరగతి విద్యార్థినిని వేధించిన కేసు వెలుగులోకి వచ్చింది.  దాని కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అమాయక విద్యార్థిని తన గదికి పిలిపించి.. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చూపించేవాడని బాలిక తండ్రి ఆరోపించాడు. 

Case Against UP School Principal For Showing Obscene Video To Class 3 Student
Author
First Published Sep 25, 2022, 3:17 AM IST

స‌మాజంలో వెలుగులోకి వ‌స్తున్న‌ ఘటనలు చూస్తుంటే..  ఆడ‌పిల్ల‌ల‌ను గ‌డ‌ప దాటి.. బ‌యట‌కు పంపించాలన్నా భయమేస్తుంటుంది.  విద్యాబుద్ధులు నేర్పి వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే. అలాంటి మ‌హోన్న‌త వృత్తిలో ఉన్న‌ ఓ ఉపాధ్యాయుడు త‌న వృత్తికి క‌ళంకం తెచ్చాడు. సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి ఒడిగట్టాడు. చిన్న పిల్లా అనే ఇంగితం మ‌రిచారు. మానవ మృగాళ్లలాగా ప్రవర్తించాడు.  త‌న పాఠ‌శాల‌లో 3వ తరగతి చదువుతున్న బాలికను వ‌క్ర‌బుద్దితో చూశాడు. ఆ విద్యార్థినికి అసభ్యకరమైన వీడియోను చూపించి  లైంగికంగా వేధించారు.  పూర్తి 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం..  బదౌన్ లోని  సిటీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ 3వ తరగతి చదువుతున్న బాలికకు అసభ్యకరమైన వీడియోను చూపించారని ఆరోప‌ణ‌లు వచ్చాయి. నిందితుడు ప్రిన్సిపాల్‌పై బాధిత బాలిక బంధువులు కేసు పెట్టారు. ఈ విష‌యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సదర్ కొత్వాలీలో నమోదైన కేసు ప్రకారం..  న‌గ‌రంలోని  సిటీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సర్వేష్ గుప్తా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆయ‌న గ‌త వారం రోజుల కిత్రం  త‌న పాఠశాలలో చదువుతున్న 3వ తరగతి విద్యార్థినిని తన గదిలోకి పిలిపించుకుని, ఆ  విద్యార్థినికి  మొబైల్‌లో అసభ్యకర వీడియోలు, చిత్రాలను చూపించారు. ఈ విష‌యాన్ని ఆ బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఆ విషయాన్ని విద్యార్థిని ఇప్పుడు తమకు తెలియజేసిందని, అందుకే శనివారం అంటే ఈరోజు ఉదయం తహ్రీర్‌తో కలిసి కొత్వాలి చేరుకున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సదర్ కొత్వాల్ హర్పాల్ సింగ్ బలియన్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులు ప్రిన్సిపాల్ కోసం కూడా వెతుకుతున్నామ‌ని తెలిపారు .అయితే పోలీసులు ఈ విషయాన్ని అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు.

నిందితుడు ప్రిన్సిపాల్‌గా ఉన్న పాఠశాలలోనే అతని భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. తని 14 ఏళ్ల కూతురు కూడా అదే పాఠ‌శాల‌లో చదువుకుంటుంది. మూడు రోజుల క్రితం కొంతమంది తన ఇంటికి వచ్చారని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించాడు.

ఈ విషయంలో క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పకపోవడంతో అతనిపై ఫిర్యాదు చేశారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణ నిజమా అబద్ధమా అనేది పోలీసుల విచారణ తర్వాతే తేలనుంది. ప్రస్తుతం పోలీసులు మొత్తం కేసు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios