రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ పట్టివేత
దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ ని కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ముంబయి ఎయిర్ పోర్టులో భారీ మోతాదులో డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్ ని కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ముంబయి నుంచి హైదరాబాద్,బెంగళూరు, చెన్నై, పాండిచేరి ప్రాంతాలకు ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల దగ్గర నుంచి పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.