22ఏళ్ల క్రితం అత్యాచారం.. నిందితుడిపై ఛార్జ్ షీట్..!
సదరు నిందితుడు 1999 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు కాగా.. జుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా.. ఈ రేప్ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు 1999లోనే పోలీసులకు చిక్కారు.
22ఏళ్ల క్రితం జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన రేప్ ఘటనకు సంబంధించి... సీబీఐ అధికారులు మూడో నిందితుడిపై అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
సదరు నిందితుడు 1999 నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు కాగా.. జుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా.. ఈ రేప్ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులు 1999లోనే పోలీసులకు చిక్కారు. వారికి 2002లో భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
ఈ ఘటన 1999లో చోటుచేసుకుంది. బాధితురాలు ట్యాక్సీలో కటక్ వెళుతుండగా... ముగ్గురు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. ఆ ట్యాక్సీని దుండగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితురాలిని కారులో లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత కారులో నుంచి కింద పడేసి.. పొలాల్లోకి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
వారు చేసిన నేరం నిరూపితం కావడంతో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు పడింది. కానీ.. మూడో నిందితుడు తప్పించుకు తిరుగుతూ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత సీబీఐ అధికారులకు చిక్కాడు.