మాందాసర్ రేప్: ఇద్దరు నిందితులకు ఉరి, 2 నెలల్లో తీర్పు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసర్లో 8 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్కు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మాసాల్లోనే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిచింది.
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసర్లో 8 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్కు పాల్పడిన ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మాసాల్లోనే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిచింది.
ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండో తరగతి చదువుకొనే బాలిక స్కూల్ బయట నిలబడి ఉంది. స్కూల్ వేళలు ముగిసిన తర్వాత తల్లిదండ్రుల కోసం ఆ బాలిక ఎదురుచూస్తోంది.
ఆ సమయంలో ఆసిఫ్, ఇర్ఫాన్ అనే ఇద్దరు దుండగులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ బాలిక గొంతుకోశారు. అయితే బాలిక మెడపై ప్రైవేట్ బాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఈ ఇద్దరు నిందితులను 24 గంటల్లోపుగానే అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం విమర్శలు ఎక్కుపెట్టింది.
గత నెలలో సిట్ గ్యాంగ్రేప్ పై 500 పేజీల చార్జీషీట్ను ఇద్దరిపై దాఖలు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష వేయాలని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కూడ డిమాండ్ చేశారు.
ఈ కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను శిక్షించాలని చీఫ్ జస్టిస్ కు అప్పట్లో చౌహాన్ లేఖ రాశారు.ఈ కేసును రెండు నెలల్లో విచారించి నిందితులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం నాడు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.