Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 13యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కళ్లు పీకేసి, గొంతులో చెక్కముక్క దూర్చి.. గొయ్యి తీసి పాతిపెట్టి

అభం, శుభం తెలియని ఓ చిన్నారి అత్యంత దారుణమైన హింసను అనుభవించింది. చివరికి ప్రాణాలు విడిచింది. 13యేళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా, కళ్లుపీకి క్రూరంగా హింసించి చంపేశారు. 

13years old girl brutally gang raped and tortured in bihar
Author
First Published Dec 20, 2022, 12:53 PM IST

బీహార్ : బీహార్ లో మనసు మెలిపెట్టే ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 13యేళ్ల స్కూలు విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం జరిగింది. కొందరు దుండగులు బాలికను అపహరించి అత్యాచారం చేయడమే కాకుండా .. ఆమెను అత్యంత దారుణంగా హింసించి చంపేశారు. అత్యాచారం తరువాత కళ్లను పీకేశారు. ఆమె నోట్లో చెక్కముక్క దూర్చారు. ఆ తరువాత ఆమెను నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. ఏడడుగుల గొయ్యి తీసి పూడ్చారు. 

కనిపించకుండా పోయిన బాలికకోసం కుటుంబసభ్యులు వెతుకులాట మొదలు పెట్టారు. అలా కుటుంబీకులు, గ్రామస్తులు నది అవతలి వైపు వెతకడానికి బయల్దేరారు. నది దాటుతుంటే అక్కడ ఓ చోట అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో అక్కడ తవ్వారు. అక్కడ ఓ చోట గుంతలో బాలిక శవం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టమ్ తరలించారు. 

ముగ్గురు మహిళలతో నైట్ క్లబ్ ఓనర్ బర్త్ డే పార్టీ.. ఇద్దరు మరణం.. మరో ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

కేసు నమోదు చేసుకున్ని నిందితులకోసం గాలింపు చేపట్టారు. బాధితురాలైన బాలిక బగాహాలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 15వ తేదీన ఆ 13యేళ్ల అమ్మాయి మాయమయ్యింది. దీంతో ఆ రోజు నుంచి వెతుకుతున్న కుటుంబ సభ్యులు..  గత ఆదివారం తెల్లవారుజామున  నదికి ఆవలి పక్కన ఏమైనా ఉందేమో అని వెతకడానికి బయలుదేరారు. ఈ క్రమంలో లో ఉన్నది సమీపంలో ఒక చోట  మట్టి తాజాగా తవ్వి పూడ్చినట్టుగా కనిపించింది. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులకు అనుమానం వచ్చింది. ఆ ప్రాంతాన్ని తవ్వి చూశారు. లోపల  పూర్తిగా నగ్న స్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. అతి దారుణమైన స్థితిలో  ఆ మృతదేహం ఉంది. 

బాలిక కళ్లు పీకేశారు.  నోట్లో చెక్క ముక్క గుచ్చారు. బాలిక ముఖంమీద  బూట్ల గుర్తులు  కూడా ఉన్నాయి. అలాగే  గొయ్యి తీసి గొయ్యి తీసి పాతిపెట్టారు.. అది చూసిన అందరికీ కడుపులో దేవినట్టయ్యింది. చుట్టుపక్కల వేట కదా పక్కనే ఉన్న చెరుకు తోటలో  బాలిక చెప్పులు దొరికాయి.  మృతదేహం దొరికింది  కాస్త దూరంలో  ఆమె స్కూల్ యూనిఫామ్ కూడా దొరికింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..  చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆ బాలికను చెరుకు ఆకులతో గొంతు కోసి చంపిన ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు కొన్ని వివరాలను తెలిపారు.. ఈ వివరాల ప్రకారం..  బాలికను తీసుకువచ్చిన నిందితులు చెరుకుతోటలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆ తర్వాత కళ్లు పీకి, గొంతులో చెక్కముక్క దూర్చి.. అత్యంత కిరాతకంగా హింసించారు. 

ఈ హింసను తట్టుకోలేక మృతి చెందిన బాలిక మృతదేహాన్ని.. నది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ గొయ్యి తవ్వి పూడ్చి పెట్టారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన కొంతమంది పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారి అనుమానాల మేరకు ఐదుగురు  అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios