Asianet News TeluguAsianet News Telugu

gang rape : దారుణం.. 12 ఏళ్ల బాలిక‌ను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్.. చ‌ర్య‌లు తీసుకోని పోలీసులు

రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ ను ఇద్దరు వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లి తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

12-year-old girl threatened with a gun and gang-raped .. Police do not take action
Author
New Delhi, First Published Jun 11, 2022, 12:25 AM IST

ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్షణ లేకుండా పోతోంది. మ‌హిళను లైంగిక దాడుల నుంచి ర‌క్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా అవి వారిని కాపాడ‌లేక‌పోతున్నాయి. ప్ర‌తీ రోజు ఎక్క‌డో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇలాంటి దారుణ‌మే జ‌రిగింది. ఓ 12 ఏళ్ల బాలిక‌ను కొంద‌రు దుండ‌గులు తుపాకీతో బెదిరించి సామూహికంగా అత్యాచారం చేశారు. 

భరత్‌పూర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌త నెల 13వ తేదీన ఈ దారుణం జ‌ర‌గ‌గా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికీ పోలీసులు చ‌ర్య‌లు తీసుకోలేదు. మే 13న ఇద్దరు వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లారు. అక్క‌డ ఆమెను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. అయితే బాలిక త‌ల్లిదండ్రులు ఆమె కోసం గాలించ‌గా.. తెల్ల‌వారు జామున అడవిలో గుర్తించారు.

Aryan Khan : నా ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ దొర‌క్క‌పోయినా న‌న్ను జైళ్లో ఉంచారు - ఆర్య‌న్ ఖాన్

ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంలో న్యాయవ్యవస్థ విఫలమైంది. ఈ విష‌యంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘‘ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. మే 13 రాత్రి నా కుమార్తెపై ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. ఇద్దరు నిందితులు ఆమెను అడవిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు.’’ అని తెలిపారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ ‘‘ పోలీసులు ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారిని అరెస్టు చేయలేదు.’’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

కాగా.. ఏప్రిల్ 24వ తేదీన  దక్షిణ ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బాధిత బాలిక తన ఇంటి నుంచి కూరగాయ‌లు కొనేందుకు బయటకు వెళ్లింది. తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిబజార్‌లో ఆటో ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవ‌ర్ షారుక్ ఆమెను మార్కెట్ లో దించ‌లేదు. పైగా తన ఇద్దరు స్నేహితులైన ఆకాష్, జువెనైల్‌ని పిలిచి ఆటో ఎక్కించుకున్నాడు.ఆ ఆటోను ఓఖ్లాకు తీసుకెళ్లాడు. అక్క‌డే ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఆటోలోనే బ‌ల‌వంతంగా తాగించారు.

Rajya Sabha Election 2022: ఓటు వేయడానికి స్ట్రెచర్‌పై వచ్చిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

అనంతరం ఆమెను టిగ్రీలోని జెజె క్యాంప్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో మైన‌ర్ అబ్బాయిని పిలింపించారు. అక్క‌డే న‌లుగురు ఆమెను బ‌ల‌వంతంగా అత్యాచారం చేశారు. వారు రాత్రంతా అక్క‌డే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం వారు న‌లుగురు ఆ మైనర్ ను మధురలోని కోసి కలాన్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ వారు ఆమెను ఒక రోజు ఉంచారు. త‌రువాత‌ది రోజు ఆమెను తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చి టిగ్రీ ప్రాంతంలో పడేశారు. బాధితురాలు, ఆమె త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు ఆ మైన‌ర్ ను ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. బాలిక‌పై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios