బీజేపీ స్లోగన్: 400కే పార్
2019 ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొచ్చింది.
గత ఎన్నికల సమయంలో అబ్కీ బార్, మోడీ సర్కార్ అనే నినాదం వర్కవుట్ అయింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 336 సీట్లను కైవసం చేసుకొంది.దీంతో వచ్చే ఎన్నికల్లో కూడ పాత స్లోగన్కు కొనసాగింపుగా అబ్కీ బార్ , 400 కే పార్ అనే స్లోగన్ తెచ్చింది. అబ్కీ బార్ ఫిర్ మోడీ సర్కార్ అనే నినాదాన్ని కూడ వాడుతోంది. మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి రావాలని ఈ స్లోగన్ బీజేపీ ప్రజల్లో ప్రచారానికి పెట్టింది.
అజేయ భారత్, అటల్ బీజేపీ అనే నినాదాన్ని తెచ్చింది. వాజ్పేయ్ గత ఏడాది మృతి చెందారు. ఆయనకు నివాళిగా బీజేపీ ఈ నినాదాన్ని తెచ్చింది. సాఫ్ నియత్ సహీ వికాస్ అనే నినాదం కూడ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తమ లక్ష్యాలు ఉన్నతమైనవి, మా దారి కూడ సరైందేనని, సరైన అభివృద్ధి అంటూ బీజేపీ ఈ నినాదాన్ని ప్రచారానికి పెట్టింది.
భవిష్యత్తు తరాలకు ఈ బంగారు బాటలు వేసేలా ప్లాన్ చేస్తున్నామని బీజేపీ చెబుతోంది. కహో దిల్ సే, నమో ఫిర్సే అంటూ నినాదం చేసింది. మరోసారి మోడీ అధికారంలోకి రావాలని మనసారా కోరుకోవాలని బీజేపీ కోరుతోంది.