ఓట్ల గాలెం వేస్తు ఉన్నరు కోట్ల సంపాదన కొరకు/ పైరవేమో చూపుతున్నరు అని అంటున్నాడు తెలుగు కవి యరకల యాదయ్య.
ఓట్ల గాలెం వేస్తు ఉన్నరు కోట్ల సంపాదన కొరకు
పైరవేమో చూపుతున్నరు
సీటు కొరకు పోటీపడుతు
కాళ్ళు వేళ్ళు పడుతున్నరు ముష్టి యుద్ధం చేస్తున్నరు
ఓటు వేసిన ప్రతిసారి మోసపోవుటే ప్రజల వంతు
గెలిచిన ప్రతిసారి కూడ పెట్టుటే నాయకుల తంతు
Add Asianetnews Telugu as a Preferred Source

ప్రజల సొమ్ముతో ప్రజలకొరకు
కుర్చీలల్లో కూర్చుండ బెట్టిన
సర్కారు కొలువుదారులు
పైరాబడి లేకుంటే సంతకమే కదలదంట
ఆన్ లైన్ దరకాస్తు చేస్తే
మైక్రో నైజ్డ్ సమస్యను చూపి
లంచమిస్తే ఒకే నంట లేదంటే
కంప్యూటర్ ఒప్పుకోదంట
ఒకరిని ఇంకొకరు దోచుకొనేదే
మనుషుల మనుగడేనట
మనకన్నామూగప్రాణులే నయం
వాటికొకటే ప్రాణ భయం
అన్నీటిలో మనకన్నా అవే నయం.
అవినీతి లేని పాలన
ఎప్పుడొస్తదోనని కలగందున
కష్టమంత మరచిపోయి
కలల లొనే తృప్తి పడుదున.
