ప్రమోద్ అవంచ తన కవిత్వంలో సున్నితమైన భావాలను అతి సుందరంగా వ్యక్తం చేశారు. విషాద మాధుర్యం ఆయన కవితల్లో పలుకుతుంది. ప్రమోద్ ఆవంచ రాసిన ఓ కవిత మీ కోసం..
అడవి చెట్లలా
అల్లుకున్న
మన బంధం
మూసిన పిడికిలా
కొనసాగింది
Add Asianetnews Telugu as a Preferred Source

శిశిరాలను ఎన్నో
చూసిన మనకు
రోజూ వసంతమే
ఇల్లంతా నిండిపోయి
నువ్వు నా మౌనాన్ని
శబ్దంగా మార్చావు
నువ్వంటే రోజూ పండగే
అందరి గుండెల్లో
కోలాహలమే
నీ మాటల్లో ఉత్సాహం
నీ నడవడిక లో
హుందాతనం
నీ నవ్వు లో
అమాయకత్వం
నాలో కొత్త మనిషిని
మేల్పొయాయి
నీ సాహచర్యం
జీవితంపై కొత్త
ఆశలు చిగురించాయి
ఎలా జీవించాలో
నేర్పించాయి
ఇప్పటికీ నువ్వు లేని
మన ఇంట్లో ఏదో
నీ అలికిడి
నా చెవులను
చేరుతూనే వుంది
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature
