తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన కవిత ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నారు.
మట్టికి కండ్లిస్తే గాని
ఆకాశం లోతు తెలువదు
Add Asianetnews Telugu as a Preferred Source

మింటి పై ఆవిరులయి
తొంగి చూడాలే గాని
మట్టి గంధం అంటదు
హృదయం
అనంతమైవిప్పారాలే తప్ప
అమ్మ అంతు పట్టదు
మనసు పాలతల్లి
లోగిలి
అక్షర కృతిగ మలచి
లోకాన్ని ఒలలాడించే
శాస్త్రజ్ఞురాలు
తొలి జ్ఞానమూలం
స్పర్శ తప్ప
ఎరుక తెలువన్నాడు
అపరిచితులే కావచ్చు
అమ్మ పేగు అద్దకం
పేగు చనుబాల వాసన
అంతర్ బహిర్ బంధ రహస్యాలు
దేవతలు అమృతం తాగారేమో
అమరులయ్యారేమో
అమ్మ ఆయువిచ్చి
అమృతమయం చేస్తున్నది
ఒడి నిండా
ముదురుకునే
అభయహస్తం
నిముషం కనబడనంతనే
ఓరకంట వెతుక్కుంటుంది
చనువు కోవెల
వెచ్చని ఊపిరులు తాకితే చాలు
ఆకలి దప్పులు
బాధల బంధీలు
శాంతిస్తయి
సహజమైన ప్రకృతి
జ్వాల
వర్తనం
జలధి
గర్జన
జవం జీవం
జగత్తు సర్వం
దేశమేదయితేనేమి
ఏ అంతరాలు లేనిది by
అమ్మ ఒకతే
ఆమెను బాధించటం
స్వయాన నశించటమే.
మరింత సాహిత్యంకోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature
