Asianet News TeluguAsianet News Telugu

డా. కె. జ్యోత్స్నప్రభ తెలుగు కవిత : జిగీష

కరోనావైరస్ మీద సమరం సాగించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ తెలుగు కవులు పలువురు కవిత్వం రాస్తున్నారు. అటువంటి కవితే డాక్టర్ జ్యోత్స్నప్రభ రాశారు.

Dr K Jothsna Prabha kavitha on fight agaonst Coronavirus
Author
Hyderabad, First Published Mar 31, 2020, 3:00 PM IST

కోయిల పాటకు పరవశం లేదు 
కొత్త చిగుళ్ళకు పులకరింత లేదు 
కవి సమ్మేళనానికి కదలిక లేదు 
కాలం ఎంత విచిత్రమైంది
కరచాలనం కూడదంటుంది
కలసికట్టుగా  సాగవద్దంటుంది 
కాళ్ళకు సంకెళ్ళు వేసిందీ ఉగాది 
దేశం కాదు కాదు ప్రపంచమే 
గజ గజా వణకుతుంది.
పెదవులపై చిరునవ్వులు మాయం 
హృదయాలలో స్పందనలు మాయం 
కాలం కరోనామయం 
కనిపించని శత్రువుతో 
యుద్ధం చేస్తున్నాం మనం 
ఆయుధం ఏకాకితనం 
అవును - ఒంటరిగా విడివడి 
సమైక్యంగా సమర భేరి మ్రోగిద్దాం
వీర స్వర్గం పొందిన వారు సరే 
విశ్వంపై మానవాళిని 
కాపాడుకోవాలి మనం.
ఇంటికే పరిమితమైతేనేం 
కంటిలో ప్రపంచాన్ని పొడవుకున్న వాళ్ళం కదా !
జనహితం కోసమే మనం 
జీవన స్రవంతి కోసమే మన కవనం 
కలంతో సవనం చేద్దాం 
ఇది కరోనాకు అంత్య సమయం 
కరోనాను జయించినప్పుడే అసలైన విజయం 

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios