నిన్నటిదాకా రొదగా వినిపించేది ఆ ఎర్రబస్సుయ/ ఇప్పుడో రోదనగా మారిపోయింది/ ఇరుపక్షాల యుద్ధంలో వేదనగీతమయింది/ దారంతా ద్వీపాలై మనుషులు అని అంటున్నారు కవి సిఎస్ రాంబాబు

నిన్నటిదాకా రొదగా వినిపించేది ఆ ఎర్రబస్సు
ఇప్పుడో రోదనగా మారిపోయింది
ఇరుపక్షాల యుద్ధంలో వేదనగీతమయింది
దారంతా ద్వీపాలై మనుషులు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బస్సంటే కస్సుబుస్సులాడే నాయకుడు
కాలే కడుపుల ఆకలి చూస్తాడా
జనసంద్రంలో నావలై గమ్యం గుమ్మాలకు
తోరణాల్లా ఉండేవి

ఎర్రటి ఎండలో చుర్రుమన్న పాదాల్లా
బిగిసిన పిడికిళ్లు..ఎగసిన కొడవళ్ళలా
ఇది కోడిపందాలాట కాదు కదా
కానీ మనుషులు ప్రాణాలే పణంగా పెడుతున్నారు

ఎక్కడో వేడిగాలి వీస్తోంది
పైనో నల్లని మేఘం నీడలా విస్తరిస్తోంది
నాలుగు చినుకులను చల్లుతుందేమో
నాలుగు మంచిమాటలతో సంధికుదిర్చే మనుషులే
కనపడటంలేదు

- సి.యస్.రాంబాబు