Asianet News TeluguAsianet News Telugu

భూమివైపు దూసుకువస్తున్న గ్రహ శకలం..ముప్పు పొంచి ఉందా?

గ్రహశకలం గ్రహం నుంచి దాదాపు 366,000 కిలోమీటర్ల దూరంలో  ఉంది.  అంటే.. చంద్రుడి కంటే భూమికి దగ్గరగా చేరుకుందని నాసా పేర్కొంది.

Asteroid twice the size of Empire State Building is hurtling towards earth, here's what we know
Author
Hyderabad, First Published Sep 9, 2021, 12:24 PM IST

భూమికి భారీ ముప్పు పొంచి ఉందా..? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. భూమి వైపు ఓ ప్రమాదకరమైన గ్రహ శకలం.. దూసుకువస్తోందని నాసా హెచ్చరిస్తోంది. న్యాయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే దాదాపు రెండు రెట్లు పెద్ద గ్రహ శకలం గురువారం భూమిని తాకనుందని నాసా హెచ్చరికలు జారీ చేస్తోంది.

2010 RJ53 అని పిలవబడే గ్రహశకలం దాదాపు 774 మీటర్ల డయామీటర్ తో ఉంటుందట. గ్రహశకలం గ్రహం నుంచి దాదాపు 366,000 కిలోమీటర్ల దూరంలో  ఉంది.  అంటే.. చంద్రుడి కంటే భూమికి దగ్గరగా చేరుకుందని నాసా పేర్కొంది.

అయితే.. ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా ఉన్నప్పటికీ.. భూమి వైపు దూసుకువస్తున్నప్పటికీ.. దానిపై ప్రభావం చాలా తక్కువగా ఉండవచ్చని నిపుణఉలు చెబుతున్నారు. మరో దశాబ్ద కాలం వరకు భూమిపై గ్రహశకలం ప్రభావం  ఉండదని నాసా చెబుతోంది.

 కాగా.. గ్రహానికి సంభవించే ప్రమాదం భూమిపై సంభవించే అత్యంత చెత్త ప్రకృతి వైపరీత్యాలలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్లు మరియు ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా సమీపంలోని గ్రహశకలాలను పర్యవేక్షిస్తారు మరియు గ్రహంపై ఏదైనా ముప్పు ఉందో లేదో తెలుసుకోవడానికి వాటి గమనాన్ని లెక్కిస్తారు.

గ్రహశకలాలు తరచుగా భూమి ద్వారా ఎగురుతాయి, ఈజిప్ట్‌లోని గిజా యొక్క గొప్ప పిరమిడ్ పరిమాణంలో ఉన్న గ్రహశకలాలు మరియు మరొకటి యుఎస్ పెంటగాన్ యొక్క పరిమాణం ఆగస్టు చివరిలో భూమి గుండా వెళుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios