భారత పర్యటనకు బయల్దేరిన డొనాల్డ్ ట్రంప్, నేరుగా అహ్మదాబాద్కి
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్వర్స్ వన్ విమానంలో ఆయన భారత్కు బయల్దేరారు.
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్వర్స్ వన్ విమానంలో ఆయన భారత్కు బయల్దేరారు. సుమారు 20 గంటల ప్రయాణం తర్వాత సోమవారం ఉదయం 11.55 నిమిషాలకు అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ట్రంప్కు ఘనస్వాగతం పలకనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మోటేరా క్రికెట్ స్టేడియం వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్ షోలో ట్రంప్-మోడీ పాల్గొంటారు. జర్మనీ మీదుగా ఆయన భారత్కు వస్తున్నారు
Also Read:
ట్రంప్కేమో సీ ఫుడ్ అంటే ప్రాణం, మెలానియాకు నట్స్ దిగవు: మరి ఇండియాలో ఎలా
ట్రంప్ "మొగాంబో" అంటున్న కాంగ్రెస్ ఎంపీ!