దారుణం: మహిళపై జడ్జితో పాటు అతని స్నేహితులు గ్యాంగ్ రేప్
ఈజిప్టులో ఓ మహిళపై దారుణం చోటు చేసుకొంది. జడ్జితో పాటు ఆయన ఇద్దరు స్నేహితులు కలిసి నాలుగు దఫాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈజిప్టు లో చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపింది.
కైరో: ఈజిప్టులో ఓ మహిళపై దారుణం చోటు చేసుకొంది. జడ్జితో పాటు ఆయన ఇద్దరు స్నేహితులు కలిసి నాలుగు దఫాలు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈజిప్టు లో చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపింది.
ఈజిప్ట్నకు చెందిన ఓ మహిళ న్యాయం కోసం జడ్జిని ఆశ్రయించింది. జడ్జి స్నేహితుల్లో కాంట్రాక్టర్ గా ఉన్న ఓ వ్యక్తి రియల్ ఏస్టేట్ కు సంబంధించిన సమావేశానికి హాజరు కావాలని బాధిత మహిళకు సమాచారం పంపారు.
రియల్ ఏస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళను మరీనాలోని ఓ హోటల్ కు రావాలని పిలిచారు. అయితే ఆ హోటల్ కు వచ్చిన ఆమెకు హోటల్స్ లో రూమ్ లు ఖాళీగా లేవని నమ్మించారు.
తమకు చెందిన ఓ విల్లాకు ఆమెను తీసుకెళ్లారు. విల్లాకు మహిళ చేరుకొన్న తర్వాత జడ్జితో పాటు అతని ఇద్దరు స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇదే విల్లాలో ఆమెను బంధించి నాలుగు దఫాలు అత్యాచారం చేశారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జడ్జితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై విచారణను కోరింది.
ఈ విషయమై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులను ఆదేశించింది.