Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది దాడి: ఇంటర్ విద్యార్థి మృతి

హైదరాబాదులోని వనస్థలిపురంలో డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థి సతీష్ పై దాడి చేశారు. అయితే, అతను మరణించాడు. డీ మార్ట్ సిబ్బంది దాడి వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Intermediate student dead in suspecious conditions
Author
Vanasthalipuram, First Published Feb 17, 2020, 10:38 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థిపై దాడి చేశారు. మృతుడిని సతీష్ గా గుర్తించారు.

ఆ తర్వాత సతీష్ మరణించాడు. దీంతో డీమార్ట్ సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపించారు. సతీష్ హయత్ నగర్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వివరాలు అందాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios