Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కీలక నిర్ణయం...పంచాయితీ కార్యదర్శుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

గ్రామ పంచాయితీల విషయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పంచాయితీ సెక్రటరీల బదిలీలపై  విధించిని నిషేధాన్ని ఎత్తివేసింది. 

AP Govt Green Signal to Panchayath Secretary's transfers
Author
Guntur, First Published Feb 18, 2020, 10:04 AM IST

అమరావతి : పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఈమేరకు వైసిపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంతగ్రామం, మండలంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే మళ్లీ నిషేధం అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

నిర్దేశిత మార్గదర్శకాలకు లోబడి ఈ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం పంచాయితీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ బదిలీ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ను ఆదేశించారు. 

కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న కార్యదర్శులు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios