Asianet News TeluguAsianet News Telugu

Samantha:మరోసారి ఐటం నెంబర్ చేస్తున్న సామ్?

 తాజాగా సమంత మరో ఐటమ్ నంబర్ కి ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో సామ్ ఓ హాట్  ఐటమ్ నంబర్ లో దుమ్ము రేపనుందని టాక్ వినిపిస్తోంది.  
 

 Samantha to be considered for a special song in Ranbir Animal ?
Author
Mumbai, First Published Jun 28, 2022, 12:44 PM IST


 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా 2021 డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.  ఇప్పుడు అదే ఊపులో ఆమె మరో ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి.  అయితే ఏ చిత్రంలో..ఏంటా విషయం అంటే...

 'పుష్ప'లో 'ఊ అంటావా.. సాంగ్' తో  సమంత హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే.  ఆ పాటతో హిందీ ఆడియెన్ గుండెల్లో సామ్ చెరగని ముద్ర వేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో బోల్డ్ పెర్ఫామెన్స్ తర్వాత ఈ ఐటం సాంగ్ ఓ రేంజిలో క్లిక్ అయ్యంది. వీటికి తోడు.. వరుసగా బోల్డ్ ఫోటోషూట్లు  ఇంటర్నెంట్ ని షేక్ చేస్తున్న తెలిసిందే.   తాజాగా సమంత మరో ఐటమ్ నంబర్ కి ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో సామ్ ఓ హాట్  ఐటమ్ నంబర్ లో దుమ్ము రేపనుందని టాక్ వినిపిస్తోంది.  

ఐటం  సాంగ్స్ అనేవి మాస్ కమర్షియల్ సినిమాల్లో ఓ కొత్త ఊపును తీసుకొస్తాయి. కమర్షియల్ సినిమాలకు ఫైట్స్ ఎంత ముఖ్యమో.. స్పెషల్ సాంగ్ కూడా అంతే ముఖ్యం అంటారు సీనియర్స్. అందుకే యానిమల్ లో ఊర మాస్ యాక్షన్ కు తోడుగా  'ఊ అంటావా.. ఊఊ అంటావా' లాంటి మరో ఐటం సాంగ్ ని పెడుతున్నట్లు సమాచారం.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి, దాని రీమేక్ ‘కబీర్ సింగ్‌’ తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన సందీప్ రెడ్డి.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి మరో బ్లాక్ బస్టర్ విజయానికి శ్రీకారం చుట్టారు. భూషణ్‌కుమార్‌, ప్రణవ్‌రెడ్డి వంగ కలిసి ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. హీరో పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి ‘యానిమల్’అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. 

భారీ అంచనాలు వున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్ ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు. యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘యానిమల్’ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ హిమాలయాల్లో మొదలైయింది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుటున్న యానిమల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. ఆగస్ట్ 11, 2023 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios