మొదలైన మరో మెట్రో.. ఎంజీబీఎస్ TO జేబీఎస్ (ఫొటోస్)
హైదరాబాద్:ఎంజీబీఎస్, జూబ్లీహిల్స్ బస్స్టేషన్ల మధ్య మెట్రో రైలు కారిడార్ను శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ రెండు బస్ స్టేషన్ల మధ్య 11 కి.మీ. దూరం ఉంటుంది. 11 కి.మీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో మెట్రో రైలులో చేరుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఈ రెండు బస్ స్టేషన్ల మధ్య 11 కి.మీ. దూరం ఉంటుంది. 11 కి.మీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో మెట్రో రైలులో చేరుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఈ రెండు బస్ స్టేషన్ల మధ్య 11 కి.మీ. దూరం ఉంటుంది. 11 కి.మీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో మెట్రో రైలులో చేరుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
ఈ రైలు మార్గం కోసం 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్తో స్టేషన్ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణిస్తాయి.
దేశంలోనే అతిపెద్ద ఇంటర్ఛేంజ్ స్టేషన్గా ఎంజీబీఎస్ ను సిద్దం చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలను కలుపుతూ ఈ రైలు మార్గం ప్రజలకు సేవలను అందించనుంది.
ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు మెట్రో రైలు చేరుకొంటుంది.
మెట్రోస్టేషన్ నుంచి చాదర్ఘట్ వైపు నిర్మించే స్కైవాక్ అతిపెద్దదిగా ఉంటుంది. 600 అడుగుల పొడవుతో 20 అడుగుల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నారు.