ఒలింపిక్ విన్నింగ్ రెజ్లర్ సుశీల్ కుమార్పై నాన్బెయిలబుల్ వారెంట్... పట్టిస్తే రూ.లక్ష రివార్డు...
ఒలింపిక్స్లో భారత్కి రెండు మెడల్స్ అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్పై హత్యకేసు నమోదైన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న ఢిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు హత్యకు ఉసిగొల్పాడని ఆరోపణలు వచ్చాయి.
ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో జరిగిన ఓ గొడవ, ఓ రెజ్లర్ (సాగర్) హత్యకు దారి తీసింది. ఈ గొడవ జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు ఘర్షణ జరగడానికి కారణం అతనేనని అనుమానిస్తున్నారు పోలీసులు.
సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు, తుపాకీలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ కుమార్ ధన్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సుశీల్ కుమార్పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం 10 రోజులుగా గాలిస్తున్నారు. అయితే సుశీల్ కుమార్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ఈ సంఘటనపై తనకే సంబంధం లేదంటున్నాడు.
తాజాగా సుశీల్ కుమార్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన పోలీసులు, అతను ఎక్కడున్నాడో సమాచారం అందించిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని తెలిపారు.
సుశీల్ కుమార్తో పాటు హత్యకేసులో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న అతని అసోసియేట్ అజయ్ కుమార్ జాడ తెలియచేసినవారికి బహుమతిగా రూ.50 వేల రివార్డు ఇస్తామని తెలిపారు ఢిల్లీ పోలీసులు.
2008లో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్పై హత్యకేసు నమోదుకావడం కలకలం రేపుతోంది.
రెజ్లింగ్తో సత్తా చాటిన సుశీల్ కుమార్కి భారత రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఛత్రపాల్ స్టేడియంల స్పెషల్ డ్యూటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సమయలో ఈ గొడవ జరిగింది.