ఆ ‘ఒక్కడు’ తప్ప, మిగిలిన అందరూ ఫెయిల్... ఆ విషయంలో మహేష్పై ట్రోల్స్...
కొన్నిసార్లు మనకు సంబంధం లేని విషయాల వల్ల కూడా మనం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్కి అలాంటి పరిస్థితే ఎదురైంది. దీనికి కారణం మహేష్ చేసిన ఓ అడ్వర్టైజ్మెంట్...
టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒక్కడైన మహేష్, యాడ్స్ విషయంలో మాత్రం టాప్లో ఉన్నాడు. ప్రమోషన్స్ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న తెలుగు హీరో మహేషే...
ఒక్క చిన్న థమ్సప్ తాగేందుకు ప్రాణాలను రిస్క్ చేసి రకరకాల రిస్క్ చేస్తున్నట్టు యాడ్లో నటించే మహేష్, ఇప్పటికే ఈ విషయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అయితే అందులో ఆ కాన్సెప్ట్ రాసినోడిది, తీసినోడిది తప్ప, ఆయన తప్పేం లేదని ఒప్పుకోవాల్సిందే...
అయితే టోక్యో ఒలింపిక్స్ 2020కి భారత అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు కొందరు క్రీడాకారులతో కలిసి ఓ ప్రమోషనల్ యాడ్ షూట్ చేసింది ఆ కూల్డ్రింక్ కంపెనీ...
మహేష్ కనిపించకపోయినా, ఆ యాడ్కి మెయిన్ హైలైట్ అయ్యింది ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ వాయిస్ ఓవరే...
‘తలకిందులు చెయ్’ అంటూ రూపొందించిన ఈ యాడ్లో భారత స్టార్ షూటర్ మను బకర్, ఆర్చర్ దీపికా కుమారి, అతానుదాస్, బాక్సర్ వికాస్ కృష్ణ యాదవ్, సౌరబ్ తివారి అండ్ షూటింగ్ టీమ్తో పాటు రెజ్లర్ భజరంగ్ పూనియా నటించారు...
ఒలింపిక్స్లో స్వర్ణం తెస్తారని భారీ ఆశలు పెట్టుకున్నవారిని ఏరికోరి ఎంచుకుని, పక్కాగా రాసుకున్నారు ఈ స్క్రిప్ట్... అయితే ఒలింపిక్స్కి ముందు అద్భుత విజయాలు సాధించి, నెం.1 షూటర్గా టోక్యోకి వెళ్లిన మను బకర్, దీపికా కుమారి... విశ్వక్రీడల్లో ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు...
అలాగే భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మెన్స్ షూటర్ సౌరబ్ తివారీతో పాటు ఆయనతో కలిసి యాడ్లో కనిపించిన నలుగురు షూటింగ్ టీమ్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు...
బాక్సర్ వికాస్ కృష్ణ యాదవ్ కూడా తొలి రౌండ్లో ఓడిపోయాడు. భారత మెన్స్ బాక్సర్లు ఎవ్వరూ ఈసారి పతకం సాధించలేకపోయారు...
మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ యాడ్లో పతకం నెగ్గిన ఒకే ‘ఒక్కడు’ రెజ్లర్ భజరంగ్ పూనియా... కాంస్యం నెగ్గిన భజరంగ్ పూనియా మినహా, మిగిలిన అందరూ టోక్యో ఒలింపిక్స్లో ఫెయిల్ అయ్యారు...
యాడ్లో ‘తలకిందులు చెయ్’ అంటూ చేతిని కిందకి దింపినప్పుడే, వీళ్లు భారత అంచనాలను తలకిందులు చేస్తూ... నిరాశపరిచే పర్ఫామెన్స్తో వస్తారని అర్థం చేసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్, ‘సంతూర్’ అంటూ సబ్బు కోసం యాడ్ చేసి తన ఇమేజ్ను తగ్గించుకుంటున్నాడని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్... ఇప్పుడు ఈ యాడ్ వల్ల మరోసారి నిరాశకు గురవుతున్నారు...
అయితే యాడ్లో చూపించిన అథ్లెట్లు సరైన పర్ఫామెన్స్ ఇవ్వకుండా ఫెయిల్ అయితే, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ను అనడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు మరికొందరు డైహార్డ్ ఫ్యాన్స్...