సూపర్ పింక్ మూన్ దర్శనం... ఎప్పుడంటే...
దేశవ్యాప్తంగా లాక్డౌన్తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఆకాశంలో చందమామ ఎప్పుడు చూసినా.. మల్లెపువ్వులాంటి తెలుపుతో కనపడుతుంది. అదే పౌర్ణమి రోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే.. ఈ సారి పౌర్ణమి రోజు మాత్రం చందమామ.. తెలుపు రంగులో కాకుండా.. గులాబీ రంగులో కనపడనుంది.
ఈ నెల 7వ తేదీ ( ఏప్రిల్7) చందమామ సూపర్మూన్గా కనిపించనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజున కనిపించే చందమామను సూపర్మూన్ అని పిలుస్తారు.
ఉత్తర అమెరికాలాంటి ప్రాంతాల్లో పింక్మూన్ అని, ఇతర దేశాల్లో స్ప్రౌటింగ్ గ్రాస్ మూన్, ది ఎగ్ మూన్, ద ఫిష్మూన్ అని పిలుస్తుంటారు. కాగా.. భారత్లో సూపర్మూన్ కనిపించకపోవచ్చని, ఈ సారి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భారత్లో సమయం 8వ తేదీ ఉదయం 8:05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు.
ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్ పింక్ మూన్ దర్శనమిస్తాడు.
20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది.