సిక్కింలో సందర్శించడానికి ఆకర్షణీయ ప్రదేశాలు ఏవో తెలుసా?
సిక్కింలో (Sikkim) అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు సందర్శకులకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని అనేక పార్కులు, దట్టమైన అడవులు, బౌద్ధమత కేంద్రాలు, తోటలు, సరస్సు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం సిక్కిం వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ఆకర్షణీయ ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తెలుసుకుందాం..
యాలుకల తోటలు, జొంగు: జొంగు ఏమైనా సుందర ప్రదేశం.ఇది యాలుకల తోటలకు:(Cardamom gardens) ప్రసిద్ధి చెందింది. సిక్కింలోని జొంగు దట్టమైన అడవులతో, యాలకుల తోటలో ఎంతో అందంగా కనిపిస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు యాలుకుల సాగుకు సరైనది. ఇక్కడి భూమి చాలా సారవంతమైన నేల. ఎటువంటి పురుగుల మందులు (Insecticides), ఎరువులు లేకుండా పంటలను పండిస్తారు. జొంగు వెళ్లినప్పుడు అందమైన యాలుకల తోటలను తప్పనిసరిగా సందర్శించండి.
గుర్దొంగ్మార్ సరస్సు, లచెన్: ఇది ప్రపంచంలోనే ఎత్తైన జలవనరులలో (Water sources) ఒకటి. ఒక మంచి నీటి సరస్సు. ఇది ఉత్తర సిక్కిం భూభాగంలో ఉంది. లచెన్ వెళ్ళినప్పుడు గుర్దొంగ్మార్ సరస్సును (Gurdongmar Lake) తప్పక సందర్శించండి. చైనా దక్షిణ సరిహద్దు నుండి 5 కి.మీల దూరంలో ఉంది. గుర్దొంగ్మార్ సరస్సు నుండి 5 కిలోమీటర్ల ముందుకు సో లాశో సరస్సు ఉంది. ఈ సరస్సును కూడా సిక్కిం వెళ్ళినప్పుడు తప్పక సందర్శించండి
కాంచేన్ జంగా జాతీయ పార్కు: ఈ పార్కును 1977 లో స్థాపించారు. ఇది సిక్కిం లోని అతిపెద్ద జాతీయ పార్క్. ఈ పార్కును సందర్శించిన మనకు అనేక జంతు జాతులు, పక్షి జాతులను చూడవచ్చు. ఈ పార్కులో అనేక వృక్ష జాతులతో పాటు ఔషధ మొక్కలు (Medicinal plants), గడ్డి మొక్కలు, పొదలు (Shrubs) కూడా వున్నాయి. ఉత్తరాన టెంట్ శిఖరం, దక్షిణాన నార్సింగ్, తూర్పున లామో ఆంగ్డేన్ పర్వతం పందిమ్ పర్వతాలు, పడమట కాంచేన్ జంగా పర్వతాలు సరిహద్దుగా కలిగి వుంది.
రుంటెక్ మొనాస్టరీ: గాంగ్టక్ నుండి 24km దూరంలో రుంటెక్ వద్ద రుంటెక్ మొనాస్టరీ (Runtech Monastery) ఉన్నది. ఈ ఆశ్రమం టిబెటన్ బౌద్ధ మత కేంద్రాలలో ఒకటిగా ఉన్నది. ఈ ఆశ్రమాన్ని ధర్మ చక్ర సెంటర్ (Dharma Chakra Center) అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 5800ft ఎత్తులో ఉన్నది. ఈ ఆశ్రమం సిక్కిం మొత్తంలో అతిపెద్ద ఆశ్రమం.
పవిత్రమైన రాయి, చుంగ్తంగ్: చుంగ్తంగ్ (Chungthang) లో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ఆశక్తికర ప్రదేశాలలో పవిత్ర రాయి ఒకటి. ఈ రాయిపై పద్మసంభవ గురు (Padmasambhava Guru) విశ్రాంతి తీసుకున్నారని, ఆయన పాదముద్రలు వదిలి వెళ్ళారని నమ్ముతూ భక్తులు వర్ణించే పవిత్రమైనదిగా భావించే రాయి.
ఇక్కడ మరో వింత ఏమిటంటే ఎల్లప్పుడూ నీరు ప్రవహించే ద్వారం కూడా ఉంది. ఈ రాయి చుట్టూ వరి పంటలు (Rice crops) పండిస్తారు. ఈ వాతావరణంలో వరి పొందడం అనేది పద్మసంభవ గురు ఆశీర్వాద బలం అని భావిస్తారు. ఈ ప్రదేశంలో చేతినిండా వరిని చల్లితే, ఈ భూమి ఎప్పటికీ ధాన్యాన్ని పండిస్తుందని అక్కడి స్థానికుల నమ్మకం (Believe).