ఇషా అంబానీ రూ.450కోట్లు విలువైన ఇల్లు చూశారా..?
దక్షిణ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని 2018లోనే పిరమాల్ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ రెండు సంవత్సరాల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు.
వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది.
దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
దక్షిణ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని 2018లోనే పిరమాల్ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు.
వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని రీ మోడల్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ భవనం ఇంటీరియర్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ భవనంలో వినియోగించిన ఫర్నిచర్ను విదేశాల్లో తయారు చేయించారు.
ఔట్డోర్ స్విమ్మింగ్ ఫూల్, మల్టిపుల్ డైనింగ్ రూములు, సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన హాళ్లు ఉంటాయి.
భవనం ముందు భాగంలో డైమండ్ ఆకారంలో తీర్చిదిద్దిన విభాగంలో మూడు అంతస్తులు ఉంటాయి.
ఇందులో ఒక స్విమ్మింగ్ఫూల్, ప్రార్థనా మందిరం ఉన్నాయి.
ఇక ఈ భవనం ముందు భాగంలో 20 లగ్జరీ కార్లను పార్క్ చేసేందుకు వీలుగా సెల్లార్ను నిర్మించారు.